Share News

ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:53 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తీవ్రమైన ఉక్కపోతను తట్టుకోలేక.. అర్ధనగ్నంగా మారిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం గదిలోకి వెళ్లి నిలబడ్డారు.

ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..
Lucknow Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. జనాల దృష్టిని ఆకర్షించేలా ఏ చిన్న వింత కనిపించినా, వెంటనే దానిని ఫోన్లలో రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లోకి వదులుతున్నారు. తాజాగా ఓ వింత ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఏటీఎం సెంటర్లకుడబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్తాం. లోపల మెషిన్లు వేడెక్కకుండా ఉండేందుకు ఏసీ ఆన్‌లో ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ ఏసీని సరికొత్తగా వాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో నవ్వులు పూయిస్తోంది. వైరల్ వీడియోలో.. ఏటీఎం సెంటర్ లోపల ఇద్దరు వ్యక్తులు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. బయట ఉక్కపోతను తట్టుకోలేక.. ఏటీఎం రూమ్‌లో ఏసీ కింద ఉపశమనం పొందారు. ఆ సమయంలో వారిని గమనించిన వారు.. ఫోన్లలో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లాల్‌బాగ్ ప్రాంతంలో గల ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో జరిగినట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘టెక్నాలజీని అసలైన పద్ధతిలో ఇప్పుడే వాడారు’అని ఒకరు కామెంట్ చేయగా.. ’అసలు వీరికి ఎంత హాయిగా ఉందో కదా’ అని మరొకరు రాసుకొచ్చారు. ’ ఈ ఎండల్లో ఏటీఎం రూమ్‌ను సరైన రీతిలో ఉపయోగించుకున్నది వీరే’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 08:02 PM