స్వర్ణభారత్ ట్రస్ట్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ABN, Publish Date - Jan 11 , 2026 | 05:56 PM
తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పలువురు ప్రముఖులతోపాటు వెంకయ్యనాయుడు కుటుంబం పాల్గొంది.
1/10
తన పిల్లలకు వారసత్వంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
2/10
ఆదివారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పలువురు ప్రముఖులతోపాటు వెంకయ్యనాయుడు కుటుంబం పాల్గొన్నారు.
3/10
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదన్నారు. అందువల్లే రాజకీయాల్లోకి తన కుమారుడు, కుమార్తెను రానివ్వలేదని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని తన పిల్లలకు సూచించానని తెలిపారు.
4/10
అదే తాను ఇచ్చే సంపద అని పేర్కొన్నారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మారకూడదని అభిప్రాయపడ్డారు.
5/10
మూలాలు మార్చిపోకుండా ప్రతి ఏడాది స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
6/10
ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండగ నిర్వహించుకుంటామని చెప్పారు.
7/10
అయితే ఈ మధ్య వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతితోనే మన పండగలు ముడిపడి ఉన్నాయన్నారు.
8/10
ప్రకృతి బాగుంటేనే భవిష్యత్తు సైతం బాగుంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు.
9/10
ఈ సంక్రాంతి సంబరాల్లో త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
10/10
ఈ స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన పలు కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
Updated at - Jan 11 , 2026 | 05:59 PM