రేపు శ్రావణ శుక్రవారం.. మహిళలతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు
ABN, Publish Date - Aug 20 , 2026 | 08:57 PM
శ్రావణ మాసం రెండో శుక్రవారం రేపు. వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీంతో పూజాకు అవసరమైన సామాగ్రితోపాటు పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లకు పోటెత్తారు.
1/12
శ్రావణ మాసం రెండో శుక్రవారం రేపు. వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
2/12
దీంతో పూజకు అవసరమైన సామాగ్రితోపాటు పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లకు పోటెత్తారు.
3/12
దాంతో హైదరాబాద్ మహానగరంలోని మోండా, కొత్తపేట, జేఎన్టీయూ మార్కెట్లు మహిళలతో కిక్కిరిసిపోయాయి.
4/12
పూలు, పండ్లు విక్రయాలు ఊపందుకున్నాయి.
5/12
పూలు, పండ్ల రేట్లకు రెక్కలు వచ్చాయి.
6/12
చామంతి, గులాబీ, బంతి పూల ధరలు ఆకాశానంటుతున్నాయి.
7/12
అరటి ఆకులు, అరటి బోదెలకు డిమాండ్ భారీగా పెరిగింది.
8/12
అలాగే కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి.
9/12
మార్కెట్లలో పూజా సామాగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.
10/12
అమ్మవారి విగ్రహాల ధరలు కూడా భారీగా పెరిగాయి.
11/12
శ్రావణ శుక్రవారం కావడంతో ఆగస్టు 21వ తేదీ అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోనున్నాయి.
12/12
మామిడి ఆకులకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది.
Updated at - Aug 20 , 2026 | 09:45 PM