రెండో రోజుకు ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు

ABN, Publish Date - Apr 23 , 2026 | 10:36 AM

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. సమ్మె కారణంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచి డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు లేకపోవడంతో బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated at - Apr 23 , 2026 | 11:42 AM