విద్యార్థులకు యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ చేసిన సీఎం రేవంత్
ABN, Publish Date - Jun 19 , 2026 | 09:51 PM
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
1/9
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది.
2/9
ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
3/9
ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
4/9
వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
5/9
తెలంగాణ వ్యాప్తంగా రూ.50.73కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.
6/9
రూ.36.65కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు.
7/9
రూ.14.08కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో బాలబాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను రేవంత్ ప్రారంభించారు.
8/9
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యా్ర్థులు హాజరయ్యారు.
9/9
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా టీపీఎస్ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
Updated at - Jun 19 , 2026 | 09:55 PM