మండుతున్న ఎండలు.. ప్రజల అవస్థలు
ABN, Publish Date - May 20 , 2026 | 10:18 AM
రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాలేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే బయటకు వచ్చే పరిస్థితే లేదు. అత్యవసరం అయితేనే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
1/12
రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాలేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే బయటకు వచ్చే పరిస్థితే లేదు.
2/12
అత్యవసరం అయితేనే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
3/12
దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య హైదరాబాద్ మహానగరంలో జన సంచారం దాదాపుగా తగ్గిపోయింది.
4/12
రహదారులు దాదాపుగా నిర్మానుష్యంగా మారిపోయాయి.
5/12
మరి అత్యవసరం అయితే.. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు.
6/12
ఆ సమయంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
7/12
ముఖానికి వస్త్రాలు కప్పుకుని.. బయటకు వెళ్తున్నారు.
8/12
అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు తాగు నీరు అందిస్తున్నారు.
9/12
ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్తోపాటు నగరంలోని పలు రైల్వే స్టేషన్లతోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రద్దీ అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి.. మంచి నీరు అందిస్తున్నారు.
10/12
మే 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది.
11/12
ఈ రోహిణి కార్తెలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది.
12/12
ఈ ఎండల ధాటికి పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Updated at - May 20 , 2026 | 10:42 AM