తూర్పు నాగాలాండ్లో అమిత్ షా పర్యటన
ABN, Publish Date - Feb 06 , 2026 | 08:33 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తూర్పు నాగాలాండ్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వివాదాస్పద సమస్యలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అమిత్ షా తన ప్రసంగంలో వివరించారు.
1/6
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తూర్పు నాగాలాండ్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
2/6
ముఖ్యంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వివాదాస్పద సమస్యలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అమిత్ షా తన ప్రసంగంలో వివరించారు.
3/6
వివాదాస్పద సమస్యలన్నింటినీ పరిష్కరించడం ద్వారా శాంతియుత, సంపన్నమైన ఈశాన్యాన్ని సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఒక పెద్ద అడుగు పడిందని అమిత్ షా ఉద్ఘాటించారు.
4/6
ENPOతో సంతకం చేసిన త్రైపాక్షిక ఒప్పందం ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా తెలిపారు.
5/6
వివాదాస్పద సమస్యలను పరిష్కరించి, శాంతియుత, సంపన్నమైన ఈశాన్యాన్ని సాధించడానికి ఈ ఒప్పందం పెద్ద అడుగని అమిత్ షా పేర్కొన్నారు.
6/6
ఈ ఒప్పందం ద్వారా తూర్పు నాగాలాండ్ అభివృద్ధికి అడ్డంకులను తొలగిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా స్థానిక ప్రజలకు అవసరమైన వనరులు, సామాజిక, ఆర్థిక అవకాశాలు త్వరగా అందేలా చూసుకోవడమే ఈ ఒప్పంద లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు.
Updated at - Feb 06 , 2026 | 08:37 AM