ఘనంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు
ABN, Publish Date - Jan 23 , 2026 | 10:37 AM
చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి ఆలయాల్లో అక్షరాభాస్యం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. అటు బాసర సర్వతీదేవి ఆలయం, విజయవాడ దుర్గమ్మ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే వసంత పంచమి సందర్భంగా హైదరాబాద్లోని సనత్నగర్ సెవన్ టెంపుల్స్కు భక్తులు తరలివచ్చారు. దేవాలయంలో చిన్నారులతో అక్షరాభ్యాసం నిర్వహించారు.
1/9
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
2/9
అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
3/9
తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు తరలివచ్చారు.
4/9
చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు తల్లిదండ్రులు.
5/9
హైదరాబాద్ సనత్నగర్లోని సెవన్ టెంపుల్స్కు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
6/9
సెవన్ టెంపుల్స్ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
7/9
చిన్నారుల చేత అక్షరాలు దిద్దిస్తున్న తల్లిదండ్రులు.
8/9
అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
9/9
బాసర సర్వసతీ దేవి ఆలయం, విజయవాడ దుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
Updated at - Jan 23 , 2026 | 10:37 AM