తిరుపతిలో భానుడి భగభగలు
ABN, Publish Date - Mar 06 , 2026 | 07:19 PM
శివరాత్రి పర్వదినం వెళ్లిన తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. చలి తగ్గింది. వేడి పెరిగింది. ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెల్లవారేసరికి సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు.
1/12
శివరాత్రి పర్వదినం వెళ్లిన తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. చలి తగ్గింది. వేడి పెరిగింది. ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెల్లవారేసరికి సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు.
2/12
ఉదయం 7.00 గంటలకే సూర్యుడి భగభగ ప్రారంభమవుతుంది. ఉదయం 11.00 గంటల నుంచి ఎండ తీవ్రమవుతుందని. సాయంత్రం 5.00 గంటల వరకు ఆ వేడి తీవ్రత తగ్గడం లేదు.
3/12
మార్చి ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే.. ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది.
4/12
మధ్యాహ్నం 12.00 గంటల వేళ.. తిరుపతి నగరంలోని రహదారులుపై ట్రాఫిక్ దాదాపుగా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. పూర్తిగా నిర్మానుష్యంగా మారుతోంది.
5/12
పని మీద బయటకు వచ్చిన వాహనదారులు గొడుగులతోపాటు వాటర్ బాటిల్లతో బయటకు వస్తున్నారు.
6/12
ఈ వేడి తీవ్రతకు కొబ్బరిబొండాలు, పుచ్చకాయలకు భారీగా డిమాండ్ పెరిగింది.
7/12
తిరుమల, తిరుపతి పరిసరాలు పూర్తిగా అటవీ ప్రాంతమన్న సంగతి అందరికి తెలిసిందే.
8/12
కానీ ఎండ వేడిని మాత్రం ఆవి నియంత్రించ లేక పోతున్నాయి.
9/12
గోవిందరాజుల స్వామి వారి ఆలయం వద్ద కూడా మధ్యాహ్నం వేళ దాదాపుగా తగ్గిపోయారు.
10/12
ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ప్రజలకు వైద్యులు సైతం సూచిస్తున్నారు.
11/12
వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వారు స్పష్టం చేస్తున్నారు.
12/12
అత్యవసరమైతే బయటకు వచ్చిన.. తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు వైద్యులు స్పష్టం చేస్తు్న్నారు.
Updated at - Mar 06 , 2026 | 07:22 PM