అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేశ్
ABN, Publish Date - Jan 29 , 2026 | 05:34 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం ఉదయం పూణేలోని బారామతి సమీపంలో గల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పవార్ పెద్ద కుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు.
1/15
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి.
2/15
గురువారం ఉదయం పుణెలోని బారామతి సమీపంలో గల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
3/15
పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు..
4/15
ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్వయంగా హాజరై నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా అజిత్ పవార్కు తుది వీడ్కోలు పలికారు..
5/15
పవార్ భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని పలువురు నేతలు ఓదార్చారు.
6/15
మహారాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.
7/15
అంతకుముందు.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శ్రద్ధాంజలి ఘటించారు.
8/15
మంత్రి నారా లోకేశ్, ఇతర ఏపీ నేతలు ఈ అంత్యక్రియలకు హాజరుకావడం ద్వారా అజిత్ పవార్ కుటుంబంతో, మహారాష్ట్రతో ఆంధ్రప్రదేశ్కు ఉన్న రాజకీయ అనుబంధాన్ని చాటుకున్నారు.
9/15
అజిత్ పవార్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే తన సంతాపాన్ని తెలియజేశారు.
10/15
మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని పలువురు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు అజిత్ పవార్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
11/15
తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్ఠాన్ మైదానానికి ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది.
12/15
అజిత్ పవార్ను కోల్పోయినందుకు నేతలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
13/15
అజిత్ పవార్ భౌతికకాయం వద్ద పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు శ్రద్ధాంజలి ఘటించారు
14/15
ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి.
15/15
గడ్కరీతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్.
Updated at - Jan 29 , 2026 | 05:40 PM