దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్బీర్ దంపతులు
ABN, Publish Date - Jan 05 , 2026 | 09:33 PM
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గ అమ్మవారిని మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్బీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధానం వద్దకు ధరమ్బీర్ గోకుల్ దంపతులకు ఆలయ ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.
1/7
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గ అమ్మవారిని మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్బీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు.
2/7
సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధానం వద్దకు ధరమ్బీర్ గోకుల్ దంపతులకు ఆలయ ఉన్నతాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.
3/7
అనంతరం ధరమ్బీర్ గోకుల్ దంపతులకు ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థాన పండితులు.. వారికి వేద ఆశీర్వచనం అందించారు.
4/7
దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఆలయ కార్య నిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ తదితరులు ధరమ్బీర్ గోకుల్ దంపతులకు దుర్గమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
5/7
గుంటూరు వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సమావేశాలను ధరమ్బీర్ గోకుల్ దంపతులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో గోకుల్ను 'భారతమిత్ర' బిరుదుతో సత్కరించారు గజల్ శ్రీనివాస్.
6/7
ధరమ్బీర్ గోకుల్కు భారత్తో 50ఏళ్ల అనుబంధం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన చరిత్ర, ఆర్థిక శాస్త్రం విభాగాల్లో విద్యనభ్యసించారు.
7/7
ఎంపీ, మంత్రిగా పనిచేసిన ఆయన.. 2024 డిసెంబర్ 6న మారిషస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Updated at - Jan 06 , 2026 | 05:37 PM