రాజమహేంద్రవరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Jan 27 , 2026 | 08:34 AM
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1/8
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
2/8
ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
3/8
అలాగే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు ఎలా వ్యవహరిస్తారనే అంశాలను ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు.
4/8
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మంటలను ఎలా అదుపులోకి తీసుకు రావాలనే అంశాన్ని వారు సోదాహరణగా వివరించారు.
5/8
విద్యార్థులతో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
6/8
త్రివర్ణ పతాకం చేతబట్టి.. బాలికలు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
7/8
దేశభక్తి గీతాలకు అనుగుణంగా బాలికలు వేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
8/8
ఈ వేడుకలు సందర్భంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నుంచి జిల్లా ఉన్నతాధికారులు గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల తీరును జిల్లా ఉన్నతాధికారులు ఈ సందర్బంగా వివరించారు.
Updated at - Jan 27 , 2026 | 08:40 AM