జీఎన్ నాయుడు పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

ABN, Publish Date - May 02 , 2026 | 12:33 PM

పారిశ్రామిక వేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని జీఎన్ నాయుడు నివాసానికి వెళ్లిన సీఎం.. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు. రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతకు ఏపీ మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం వద్ద మంత్రి లోకేశ్ పుష్పాంజలి ఘటించారు.

Updated at - May 02 , 2026 | 12:50 PM