ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల
ABN, Publish Date - Sep 02 , 2026 | 06:19 PM
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన అనంతరం ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.
1/6
పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
2/6
ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ కోలాట ప్రదర్శనతో ఆయనను ఆహ్వానించారు.
3/6
సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి ఇచ్చి, పవిత్ర జలాలను తలపై చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ నమస్కారం చేసి.. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
4/6
ఎడమ కాల్వ ద్వారా వదిలే నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
5/6
ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
6/6
చంద్రబాబును చూసి నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Updated at - Sep 02 , 2026 | 06:33 PM