విశాఖ ఆర్కే బీచ్లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం
ABN, Publish Date - Sep 19 , 2026 | 09:46 PM
విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.
1/6
విశాఖపట్నం ఆర్కే బీచ్లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం.. బీచ్లో జరుగుతున్న శుభ్రత పనులను పరిశీలించారు.
2/6
సముద్ర వ్యర్థాలను సేకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ద్వారా లభిస్తున్న ప్రోత్సాహకాలతో తమకు అదనపు ఆదాయం వస్తోందని మత్స్యకారులు తెలిపారు.
3/6
మ్యాన్హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
4/6
అలాగే జీవీఎంసీ సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్తు లక్ష్యాలపై బ్లూమ్బెర్గ్ ప్రతినిధులతో సీఎం చర్చించారు.
5/6
సాగర తీరంలో మురి మిక్చర్ విక్రయిస్తున్న మహిళతో చంద్రబాబు మాట్లాడారు. ఆమె జీవనోపాధి, వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విక్రయిస్తున్న మురి మిక్చర్ను సీఎం ఆస్వాదించారు.
6/6
మురి మిక్చర్ విక్రయించే మహిళ ఒంటరి మహిళ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
Updated at - Sep 19 , 2026 | 09:46 PM