నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 06 , 2026 | 06:56 PM

అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు. యాడికిలో ఏర్పాటు చేసిన నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని తెలిపారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 1/12

అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 2/12

యాడికిలో ఏర్పాటు చేసిన నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 3/12

నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని తెలిపారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 4/12

పరిగెత్తే నీటిని నిలబెట్టాలి.. నిలబడిన నీటిని నిల్వ చేయాలి.. జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలని సాగునీటి సంఘాలు, రైతులకు వివరించారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 5/12

అలాగే గతంలో నీటి సంరక్షణ కోసం తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను సీఎం వివరించారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 6/12

అనంతపురంలో భూగర్భ జలాల నీటిని పెంచడం కోసం చేపట్టిన చర్యలను సైతం గుర్తు చేశారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 7/12

నీటి భద్రతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 8/12

మైక్రో ఇరిగే‌షన్‌లో తాము చేసిందే.. దేశం మొత్తం అనుసరించిందన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 9/12

డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని చెప్పారు. హార్టికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 10/12

ఏపీకి రాజధాని అమరావతి ఏకైక రాజధాని అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని గుర్తు చేశారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 11/12

అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సంఘటనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.

నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు 12/12

వైసీపీ నేతల చర్యలను ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రులతోపాటు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated at - Apr 06 , 2026 | 06:59 PM