క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో మంత్రి లోకేష్ భేటీ
ABN, Publish Date - Mar 12 , 2026 | 11:54 AM
క్యాప్ జెమిని సీఈవో ఐమాన్ ఇజ్జత్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది.
1/5
క్యాప్ జెమిని సీఈవో ఐమాన్ ఇజ్జత్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది.
2/5
విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
3/5
ఆంధ్రప్రదేశ్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి, డిజిటల్ టాలెంట్ పైప్ లైన్) ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్మెంట్ పార్టనర్గా వ్యవహరించాలని అభ్యర్థించారు.
4/5
ఆంధ్రప్రదేశ్లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ చెప్పారు.
5/5
ఈ సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ పాల్గొన్నారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది.).
Updated at - Mar 12 , 2026 | 11:55 AM