విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 20 , 2026 | 08:35 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాలను సీఎం పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు పట్టాలు అందించి వారితో ఫొటో దిగారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 1/15

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నంలో పర్యటించారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 2/15

ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో పేదలకు ఇళ్ల పట్టాలను సీఎం పంపిణీ చేశారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 3/15

విశాఖలో ఏర్పాటు చేసిన వేదికపై లబ్దిదారులకు పట్టాలు అందించి వారితో సీఎం ఫొటో దిగారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 4/15

28,445 కుటుంబాలు నివసించే ఇళ్లపై హక్కులు కల్పిస్తూ పట్టాలను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 5/15

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాల పంపిణీకి భారీగా హాజరైన ప్రజలు

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 6/15

అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, నారాయణ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ భరత్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 7/15

అనంతరం విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 8/15

సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 9/15

సముద్ర వ్యర్ధాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 10/15

సాగర స్వచ్ఛతలో భాగంగా ఏకంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు.. అధికారులు వివరించారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 11/15

మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో ముఖ్యమంత్రి పరిశీలించారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 12/15

ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బీచ్‌లో స్వయంగా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 13/15

సాగర తీరంలో మురి మిక్చర్ విక్రయించే మహిళ స్టాల్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆమె జీవనోపాధి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 14/15

సాగర తీరంలో మురిమిక్చర్‌ను సీఎం చంద్రబాబు ఆస్వాదించారు.

విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 15/15

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంపీ శ్రీభరత్, గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

Updated at - Sep 20 , 2026 | 09:12 AM