అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..

ABN, Publish Date - Aug 15 , 2026 | 02:51 PM

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ప్రాంతంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 1/8

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 2/8

రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వర్ణాంద్ర-2047 థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 3/8

రాజధానిలో జరుగుతోన్న 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 4/8

సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్‌తో బుల్లెట్ ఎస్కార్ట్ చేరుకుంది.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 5/8

ఈ సందర్భంగా సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 6/8

పోలీసు దళాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు దళాల సన్నద్ధతను చంద్రబాబు సమీక్షించారు.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 7/8

అనంతరం పోలీసు బలగాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీసు దళం.. మార్చ్ పాస్ట్ నిర్వహించాయి.

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. 8/8

ఆగస్టు 15 సందర్భంగా జాతీయ జెండాలతో చిన్నారుల సందడి నెలకొంది. దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated at - Aug 15 , 2026 | 02:51 PM