చింతతో చింత ఏల?
ABN , Publish Date - Jul 28 , 2026 | 04:50 AM
ఈ పుల్లని పండు మన మెదడులోని ఫ్లోరైడ్ను శరీరం బయటకు పంపించేస్తుంది. మరిన్ని వివరాలు....
ఫుడ్ ఫ్యాక్ట్
ఈ పుల్లని పండు మన మెదడులోని ఫ్లోరైడ్ను శరీరం బయటకు పంపించేస్తుంది. మరిన్ని వివరాలు....
కుళాయి నీళ్లు, వంటపాత్రల ద్వారా ఫ్లోరైడ్ మన పినియల్ గ్రంథిలోకి చేరుకుని, అక్కడే నిల్వ ఉండిపోతూ ఉంటుంది. కొన్నేళ్ల వ్యవధిలో అది నిద్ర, జ్ఞాపకశక్తులను దెబ్బతీసే స్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా మెదడులో పేరుకుపోయిన ఫ్లోరైడ్ పోస్ట్మార్టమ్స్లో బయటపడుతూ ఉంటుంది.
రోజుకు పది గ్రాముల చింతపండు తిన్న మగపిల్లల మూత్రంలో ఫ్లోరైడ్ పరిమాణం పెరిగినట్టు ఒక ప్రయోగంలో తేలింది. కేవలం చింతపండు తినడం వల్లే ఈ ఫలితం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు నిర్థారించారు.
చింతపండులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, బి విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. దీన్లోని ఫైబర్ లాక్సేటివ్గా ఉపయోగపడి ఫ్లోరైడ్ను శరీరం బయటకు పంపించేస్తుంది.
చింతపండులోని పాలిఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ను, రక్తంలోని చక్కెర మోతాదులను తగ్గిస్తాయు. హృదయస్పందనను స్థిరీకరించి, ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి.
తీపి, పులుపు ఈ చింతపండ్లు రెండూ ఒకే రకమైన ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News