ఆఫీసులో నిద్రమత్తు వదిలేదెలా..?
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:38 AM
ఒక్కోసారి ఆఫీసులో పని చేస్తున్నా కూడా నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి.....
ఒక్కోసారి ఆఫీసులో పని చేస్తున్నా కూడా నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి...
ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుంటే కుర్చీలో నుంచి లేచి పావుగంటసేపు అటూ ఇటూ నడిస్తే చాలు. నిద్రమత్తు వదిలి చురుకుగా పనిచేయాలనిపిస్తుంది. కొద్దిసేపు ఇష్టమైన సంగీతాన్ని వినడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
డీహైడ్రేషన్ వల్ల వచ్చే అలసట కూడా నిద్రకు కారణం కావచ్చు. తరచూ నీరు తాగుతూ ఉంటే శరీరానికి శక్తి లభించి నిద్ర మత్తు తగ్గుతుంది.
ముఖం, కనురెప్పలపై చల్లటి నీటిని చిలకరించుకుంటే తాజా అనుభూతి కలిగి నిద్ర పోతుంది.
కుర్చీలో కూర్చుని కొద్దిసేపు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేస్తే కండరాలు విశ్రాంతి పొంది మంచి ఫలితాన్నిస్తాయి.
రెండు నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలడం వల్ల మెదడు చురుకుగా మారి నిద్రను పోగొడుతుంది.
మధ్యాహ్న సమయంలో ఆహారాన్ని మితంగా తీసుకుంటూ ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగినా నిద్ర మత్తు తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది.
రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రిస్తే పగలు ఆఫీసులో నిద్ర రాదు.
ఆఫీసు టేబుల్ వద్ద మసక వెలుతురు కాకుండా మంచి లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పుదీనా, నిమ్మ వాసనలతో కూడిన డిఫ్యూజర్ను ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News