భారత్కు సహాయం.. కీలక ఆయుధాల సర్వీసులకు అమెరికా సిద్ధం..
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:39 AM
భారత్కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా సహాయం చేయబోతోంది. ఈ మేరకు అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది.
భారత్కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా సహాయం చేయబోతోంది. ఈ మేరకు అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలను కొత్త ఆయుధాల కొనుగోలు కోసం కాకుండా ఇప్పటికే భారత సైన్యంలో సేవలందిస్తున్న వ్యవస్థల నిర్వహణ, శిక్షణ, విడిభాగాల సరఫరా కోసం కేటాయించారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్కు విదేశాంగ శాఖ తెలియజేసింది (India US Defence Deal).
అమెరికా ఇవ్వనున్న 428.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీలో 198.2 మిలియన్ డాలర్లను ఏహెచ్-64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్వహణ కోసం కేటాయించారు (Apache Helicopter Support). ఇందులో ఇంజినీరింగ్ సేవలు, సాంకేతిక సహాయం, లాజిస్టిక్ మద్దతు, శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీకి బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటాయి.
మరో 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఎం-777 ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ తుపాకుల నిర్వహణకు కేటాయించారు (M777 Howitzer Support). దీనిలో విడిభాగాలు, సాంకేతిక సహాయం, శిక్షణ, లాజిస్టిక్ మద్దతు వంటి సేవలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన కాంట్రాక్టర్గా బీఏఈ సిస్టమ్స్ వ్యవహరించనుంది.
ఈ ఒప్పందాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది (US Defence Package India). ఈ సహాయం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
క్యాబ్ డ్రైవర్కు జాక్పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..