తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్సిగ్నల్..
ABN , Publish Date - May 07 , 2026 | 11:45 AM
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ 40 నిమిషాల భేటీ తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ 40 నిమిషాల భేటీ తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 108 అసెంబ్లీ సీట్లతో టీవీకే అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్, వీసీకేల మద్దతుతో ఆ పార్టీ బలం 114కు పెరిగింది.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సత్తాచాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బుధవారం నాడు తన సహచరులు బుస్సీ ఆనంద్, అధవ్ అర్జున, సెంగోట్టయ్యన్ సహా పలువురితో కలిసి లోక్భవన్కు వెళ్లారు విజయ్. గవర్నర్ను కలిసి తమ పార్టీ నుంచి గెలిచిన 107 (విజయ్ రెండు స్థానాల్లో గెలిచారు) మంది ఎమ్మెల్యేల జాబితాను అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని రాజేంద్ర అర్లేకర్ను కోరారు.
అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరమని, వారందరి వివరాలను అందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో లోక్భవన్ నుంచి విజయ్ వెనుదిరిగారు. ఈ పరిణామాల అనంతరం కాంగ్రెస్, వీసీకే పార్టీలు విజయ్కు మద్దతు తెలపడంతో సంఖ్యా బలం 114కి పెరిగింది. ఈరోజు గవర్నర్ను విజయ్ మరోసారి కలవగా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తి.. సాయుధ దళాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
తమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరగాలి: జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు