Share News

జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి

ABN , Publish Date - Mar 28 , 2026 | 09:03 AM

జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది.

జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి
Srinagar Leh Highway Avalanche

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.


శ్రీనగర్-లేహ్ హైవేపై ఉన్న జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా విరుచుకుపడిన మంచు చరియల కింద అనేక వాహనాలు పూడుకుపోయాయి. రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఊహించని విధంగా మంచు గడ్డల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ప్రమాద స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతికి చట్టబద్ధత.. నేడు ఏపీ అసెంబ్లీలో చారిత్రక తీర్మానం..

ఘోరం.. ప్రియుడి కోసం కన్న తండ్రినే చంపిన మహిళా పోలీస్..

Updated Date - Mar 28 , 2026 | 09:13 AM