Share News

శబరిమల కేసు.. జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 05 , 2026 | 03:26 PM

శబరిమల వివాదంలో ‘విశ్వాసం’, ‘రాజ్యాంగ నైతికత’పై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.

శబరిమల కేసు.. జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు
Sabarimala controversy

న్యూఢిల్లీ, మే 5: శబరిమల వివాదంలో ‘విశ్వాసం’, ‘రాజ్యాంగ నైతికత’పై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నియమాలను పాటించని వారిని కోర్టు ప్రోత్సహించదని స్పష్టం చేశారు. దైవంపై విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఆచారాలను గౌరవిస్తారని వ్యాఖ్యానించారు. కేవలం హక్కుల పేరుతో ఆలయ ప్రవేశం కోరడంపై జస్టిస్ నాగరత్న అసహనం వ్యక్తం చేశారు. దైవంపై నమ్మకం లేని వారు ఆలయంలోకి ప్రవేశించడం సరైనది కాదన్నారు.


గత విచారణ వివరాలు..

శబరిమల కేసుపై గత నెల 23వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న వాట్సాప్ యూనివర్సిటీపై సెటైర్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ల మధ్య సమతుల్యత ఉండాలని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఏ మూల నుంచైనా, ఏ విశ్వవిద్యాలయం నుంచైనా వచ్చే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఆహ్వానించాలని అన్నారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. ‘కానీ.. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాత్రం కాదు. మతపరమైన హక్కులు ఎప్పుడూ నైతికత, ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు లోబడే ఉంటాయి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసు.. మరో నలుగురి అరెస్ట్

Updated Date - May 05 , 2026 | 04:13 PM