హైఫైవ్లు ఇస్తూ.. నవ్వులు చిందిస్తూ..
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:12 AM
ప్రధానఇ మోదీ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన విద్యార్థినులతో...
ప్రధాని రాఖీ వేడుకలు
మోదీకి రాఖీలు కట్టిన విద్యార్థినులు
రాఖీ కట్టిన వారిలో తెలుగు బాలిక మధుమిత
న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధానఇ మోదీ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన విద్యార్థినులతో మోదీ రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకుంటూ, హైఫైవ్లు ఇస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ఆ పిల్లలు చెప్పిన కవితలు వింటూ కోలాహలంగా గడిపారు. ఢిల్లీ ప్రసాద్ నగర్లోని ‘ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ’ డాక్టర్ బి.వి. నాథ్ అండ్ టి.ఆర్. రావు మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ 12వ తరగతి విద్యార్థిని, తెలుగు అమ్మాయి సాయి మధుమిత కూడా ఈ వేడుకల్లో ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ఈ వేడుకలకు ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఎంపికవ్వగా.. వారిలో సాయి మధుమిత ఒక్కరే తెలుగు అమ్మాయి కావడం విశేషం. 2026-27 విద్యా సంవత్సరంలో సైన్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన మధుమిత ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రధాని మోదీకి రాఖీ కట్టే అవకాశం లభించడం తన జీవితంలో మర్చిపోలేనని మధుమిత ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు