Share News

ఎంపీలాడ్స్‌ నిధుల వ్యయంలో తెలుగు రాష్ట్రాల ఎంపీల వెనుకంజ

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:13 AM

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్‌ సభ్యులకు.. కేంద్రప్రభుత్వం ఏటా రూ.5 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తున్నప్పటికీ, వాటిని...

ఎంపీలాడ్స్‌ నిధుల వ్యయంలో తెలుగు రాష్ట్రాల ఎంపీల వెనుకంజ

  • వచ్చిన నిధుల్లో 23 శాతమే ఖర్చు

  • 2024 నుంచి తెలంగాణకు 394 కోట్లు.. వ్యయం 94 కోట్లు

  • 91.3 % మంది పనితీరు పేలవం

  • 4.3% మంది పనులే చేయలేదు

  • ఏపీ ఎంపీలకు రూ.554 కోట్లు.. ఖర్చు రూ.127 కోట్లు

  • 78.4% మంది పనితీరు పేలవం

  • ఒక్కపైసా ఖర్చు చేయని కేంద్ర మంత్రి భూపతి రాజు,

  • ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ

న్యూఢిల్లీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్‌ సభ్యులకు.. కేంద్రప్రభుత్వం ఏటా రూ.5 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తున్నప్పటికీ, వాటిని ఖర్చు చేయటంలో ఎంపీలు వెనుకబడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు కూడా దీనికి మినహాయింపు కాదని కేంద్రం తాజాగా విడుదల చేసిన వివరాలతో వెల్లడైంది. వీరిలో కేంద్ర మంత్రులు కూడా ఉండటం విశేషం. 2024లో మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలోని 36రాష్ట్రాల ఎంపీలకు రూ.11,681 కోట్లు విడుదల చేయగా, ఆ మొత్తంలో రూ.3,964 కోట్లు మాత్రమే(33.9%) ఖర్చు పెట్టారు. నాగాలాండ్‌ ఎంపీలు తమకు లభించిన ఎంపీలాడ్స్‌ నిధుల్లో 94.6% ఖర్చు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఎంపీలు కేవలం 26.87% నిధులనే అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో ఉభయసభలకు చెందిన ఎంపీలకు రూ.394 కోట్లు కేటాయిస్తే రూ.94 కోట్లు(23.8%) వ్యయం చేశారు. 91.3% మంది ఎంపీలు పేలవమైన పనితీరు కనపరిచారని, 4.3% మంది అసలు పనులే చేయలేదని వెల్లడైంది. ఏపీ ఎంపీలకు రూ.554 కోట్లు కేటాయించగా రూ.127కోట్లు (23ు)ఖర్చు చేశారు. ఏపీలోని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తనకు కేటాయించిన రూ.14 కోట్లలో ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీకి 7కోట్లు కేటాయించినా ఒక్క పైసా ఖర్చు చేయలేదు.

1-National-1-09.jpg

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 06:13 AM