కోల్కతాలో భూకంపం..
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:20 PM
కోల్కతాలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్లో 5.3–5.5 గా నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతాలో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో, ఆఫీస్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం 1:22 గంటల ప్రాంతంలో సుమారు 45 సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్లో 5.3–5.5 గా నమోదైంది. కోల్కతా మాత్రమే కాకుండా హౌరా, హుగ్లీ, సుందర్బన్స్ ప్రాంతాలు కూడా భూకంప ప్రభావానికి గురయ్యాయి. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, ప్రజలు సురక్షితంగా ఉన్నారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు
Read Latest National News