దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం..
ABN , Publish Date - Aug 16 , 2026 | 10:31 AM
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. దేశ వ్యతిరేక, తీవ్రవాద శక్తుల ఒత్తిళ్లకు కేరళం ప్రభుత్వం లొంగిపోయిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశంపై న్యాయపరంగానూ, రాజకీయంగానూ పోరాడతామని పార్టీ ప్రకటించింది (Kerala Vande Mataram row).
ఆగస్టు 15న తిరువనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించలేదు. అదే సమయంలో కేరళం విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పాఠశాలలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించాలని సూచించింది. అయితే వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేయలేదు. దీంతో ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది (Kerala Vande Mataram controversy).
బీజేపీ నేత షోన్ జార్జ్ కేరళం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు (BJP Kerala). ముఖ్యమంత్రి సతీశన్ నాయకత్వం గత ఏడాది కాలంగా జమాత్-ఇ-ఇస్లామీ, దేశ వ్యతిరేక శక్తులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. వందేమాతరం ఆలపించకపోవడం ఉద్దేశపూర్వక నిర్ణయమేనని, తీవ్రవాద శక్తుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గిందని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో అధికారులను కూడా బాధ్యులను చేస్తామని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు తమ పార్టీ ముందుకు వెళ్తుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..