Share News

బంగ్లాదేశ్‌లో భారత మిషన్ అధికారి మృతి.. దర్యాప్తు ప్రారంభం..

ABN , Publish Date - May 19 , 2026 | 09:34 PM

బంగ్లాదేశ్‌లోని భారత మిషన్‌లో పనిచేస్తున్న ఒక ప్రోటోకాల్ అధికారి మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం చిట్టగాంగ్‌లోని భారత సహాయ హైకమిషన్ కార్యాలయం నుంచి ప్రోటోకాల్ అధికారి నరేన్ ధర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్‌లో భారత మిషన్ అధికారి మృతి.. దర్యాప్తు ప్రారంభం..
Indian mission official death

బంగ్లాదేశ్‌లోని భారత మిషన్‌లో పనిచేస్తున్న ఒక ప్రోటోకాల్ అధికారి మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం చిట్టగాంగ్‌లోని భారత సహాయ హైకమిషన్ కార్యాలయం నుంచి ప్రోటోకాల్ అధికారి నరేన్ ధర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ (CMC) ఆసుపత్రిలోని మార్చురీకి పంపారు (Indian mission official death).


నరేన్ ధర్ మరణానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నరేన్‌ది సహజ మరణమా లేదా అతడి మృతి వెనుక అనుమానాస్పద కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు (Bangladesh India diplomat death).


'నరేన్ ధర్ భారత సహాయ హైకమిషన్‌లో ప్రోటోకాల్ అధికారిగా పనిచేస్తున్నారు (India Bangladesh relations). ఈ రోజు ఉదయం ఆయన మృతి విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం కోసం సీఎంసీ ఆసుపత్రి మార్చురీకి పంపారు' అని చిట్టగాంగ్ ఏసీపీ అమీనూర్ రషీద్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన


పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 19 , 2026 | 09:34 PM