Share News

2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:52 AM

భారత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికల్లా ఏర్పాటు చేస్తామని ప్రధా ని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్‌ వేదికగా...

2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం

  • 2040కల్లా భారతీయుడిని చంద్రుడిపైకి పంపుతాం

  • అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ప్రధాని మోదీ

  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: భారత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికల్లా ఏర్పాటు చేస్తామని ప్రధా ని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్‌ వేదికగా గురువారం జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. చంద్రయాన్‌-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందన్నారు. ఆదిత్య ఎల్‌1తో సూర్యుడి రహస్యాలు తెలిశాయన్నారు. గత ఏడాది ఓ భారతీయుడు అంతరిక్ష కేంద్రంలో ఉండి వచ్చారని గుర్తుచేశారు. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ ప్రయోగాల ద్వారా లభించే ప్రయోజనాలు సర్వ మానవాళికి అందించాలన్నదే తమ ఆశయమన్నారు. ఇస్రోతో పాటు దేశంలో ప్రైవేట్‌ అంతరిక్ష రంగం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 1960లో భారత అంతరిక్ష కార్యక్రమాలు ప్రారంభమైననాటి నుంచి ఫ్రాన్స్‌ ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉందన్నారు. ప్రస్తుతం ఇరు దే శాల సహకారం ఆధునిక టెక్నాలజీల మొదలు శాస్త్రీ య నైపుణ్యాన్ని మానవ అవసరాలకు వినియోగించడం వరకు కొనసాగుతోందని చెప్పారు. భవిష్యత్‌ అంతరిక్ష పరిశోధనలకు భారత్‌తో పాటు కలిసి సాగడానికి ప్రపంచదేశాలను ఆయన ఆహ్వానించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 11 , 2026 | 05:52 AM