UGC: యూనివర్సిటీల్లో కులవివక్ష తీవ్రం..!
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:57 AM
విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది. ఐదేళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల ఆధారిత వివక్ష ఫిర్యాదులు...
ఐదేళ్లలో 118 శాతం పెరిగిన ఫిర్యాదులు.. యూజీసీ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 18: విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది. ఐదేళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు, కాలేజీల్లో కుల ఆధారిత వివక్ష ఫిర్యాదులు 118.4 శాతం పెరిగాయి. ఈ మేరకు యూజీసీ పార్లమెంటరీ ప్యానెల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో నమోదిత ఘటనలు 173 ఉండగా.. ఆ సంఖ్య 2023-24 నాటికి 378కి పెరిగింది.
2019-20, 2023-24 మధ్య 704 విశ్వవిద్యాలయాలు, 1,553 కాలేజీల్లోని ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ (ఈవోసీ), ఎస్సీ/ఎస్టీ విభాగాల నుంచి యూజీసీకి 1,160 ఫిర్యాదులు అందగా.. వీటిల్లో 1,052 ఫిర్యాదులను (90.68ు) పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెండింగ్ కేసుల సంఖ్య 18 నుంచి 108కి పెరిగాయని యూజీసీ డేటా వెల్లడించింది. ఎస్సీ/ఎస్టీ, ఈవోసీ విభాగాల పనితీరుపై విద్యార్థుల్లో అవగాహన పెరగడమే ఫిర్యాదుల పెరుగుదలకు కారణమని యూసీజీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విభాగాలు కేసులను చురుగ్గా పరిష్కరిస్తున్నాయని అన్నారు.
ఇవి కూడా చదవండి...
స్పెయిన్లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
Read Latest Telangana News And Telugu News