Share News

నేడు పశ్చిమ బెంగాల్ కేబినెట్ విస్తరణ.. 35 మందికి మంత్రులుగా అవకాశం..

ABN , Publish Date - Jun 01 , 2026 | 10:37 AM

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించనుంది. ఈరోజు (సోమవారం) సుమారు 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్.రవి కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.

నేడు పశ్చిమ బెంగాల్ కేబినెట్ విస్తరణ.. 35 మందికి మంత్రులుగా అవకాశం..
West Bengal Cabinet Expansion

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కేబినెట్‌(West Bengal Cabinet Expansion)ను విస్తరించనుంది. ఈరోజు (సోమవారం) సుమారు 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్.రవి(Governor RN Ravi) కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.


మే 4న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మెుట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు మే 9న ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించి మరో 35మందికి బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.


ఎమ్మెల్యేలు అర్జున్ సింగ్, అశోక్ దిండా, రూపా గంగూలీ, స్వపన్ దాస్‌గుప్తా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన తపస్ రాయ్‌ సహా పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికైన వారికీ కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నారు. దీంతో సీఎం సహా మంత్రుల సంఖ్య 41కి చేరనుంది. కాగా, పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో 44 మంది సభ్యులకు చోటు కల్పించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

స్టార్ సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత..

18 ఏళ్ల యువతి మృతికి కారణమైన బార్‌లో వాగ్వాదం..

Updated Date - Jun 01 , 2026 | 11:16 AM