-
-
Home » Mukhyaamshalu » ap telangana national international ABN Andhrajyothy live updates of 11th february 2026 siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 11 , 2026 | 07:52 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Feb 11, 2026 20:30 IST
ఎన్నికల కమిషన్ చర్యలపై జగ్గారెడ్డి స్పందన
BRS దొంగ ఓట్లపైనే ప్రశ్నించా: జగ్గారెడ్డి
ఒక వార్డులో 300కి పైగా దొంగ ఓట్లు ఉన్నాయి: జగ్గారెడ్డి
దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను..
సీఐ శివకుమార్ పట్టుకున్నారు: జగ్గారెడ్డి
సీఐ శివకుమార్ వైఖరి వల్లే గొడవ జరిగింది: జగ్గారెడ్డి
గొడవ జరగడానికి ఈసీ, జిల్లా అధికారులు బాధ్యులు కారా?: జగ్గారెడ్డి
దొంగ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించలేదు: జగ్గారెడ్డి
దొంగ ఓట్లు తొలగించకుండా.. ప్రశ్నించిన మాపైనే కేసులా?: జగ్గారెడ్డి
దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ విఫలం: జగ్గారెడ్డి
-
Feb 11, 2026 19:37 IST
BRS, BJP ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి: మంత్రి పొన్నం
పోలీసులను BRS, BJP నాయకులు భయపెట్టారు: మంత్రి పొన్నం
ఎన్నికల వేళ బీజేపీ మత విద్వేషాలు రేపింది: మంత్రి పొన్నం
BRSను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరు: మంత్రి పొన్నం
-
Feb 11, 2026 19:37 IST
ఎన్నికల సంఘం సీరియస్
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఎన్నికల సంఘం సీరియస్
జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశం
ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు: SEC
-
Feb 11, 2026 18:43 IST
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా: పీపుల్స్ పల్స్ సర్వే
70% కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్వే: పీపుల్స్ పల్స్
మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్..
కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా: పీపుల్స్ పల్స్
బీజేపీకే కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు: పీపుల్స్ పల్స్
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో..
కింగ్ మేకర్ కానున్న ఎంఐఎం: పీపుల్స్ పల్స్ సర్వే
కార్పొరేషన్లలో BRS గెలిచే అవకాశాలు లేవు: పీపుల్స్ పల్స్ సర్వే
68-76 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే హవా: పీపుల్స్ పల్స్ సర్వే
8-14 మున్సిపాలిటీల్లో పోటాపోటీ: పీపుల్స్ పల్స్ సర్వే
-
Feb 11, 2026 18:32 IST
కామారెడ్డి 9వ వార్డులో ఉద్రిక్తత
కాంగ్రెస్ కార్యకర్తలు దొంగఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ ఆందోళన
బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, పరస్పర వాగ్వాదం
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
-
Feb 11, 2026 18:02 IST
నిజామాబాద్: నగరంలోని 11వ డివిజన్లో ఉద్రిక్తత
ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
కర్రలతో దాడులు చేసుకున్న ఇరువర్గాలు
రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
పలువురికి తీవ్రగాయాలు
-
Feb 11, 2026 17:09 IST
నిజామాబాద్: నగరంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్చల్
హరిచరణ్ మార్వాడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఎంపీ ఆగ్రహం
బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారని ఎంపీకి ఫిర్యాదు చేసిన కార్యకర్తలు
కేంద్రానికి వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఎంపీ
-
Feb 11, 2026 17:06 IST
ముగిసిన పోలింగ్
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
సా.5 గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్
ఎల్లుండి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
ఈనెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక
ఈనెల 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
-
Feb 11, 2026 17:05 IST
దొంగ ఓట్ల కలకలం
నల్గొండ: హాలియా మున్సిపాలిటీలో దొంగ ఓట్ల కలకలం
అమెరికాలో ఉన్నవారి ఓట్లు వేశారంటూ..
రిటర్నింగ్ అధికారికి 7వ వార్డు అభ్యర్థి శ్రీనివాస్ ఫిర్యాదు
-
Feb 11, 2026 15:31 IST
కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం
బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్.
లాఠీచార్జ్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు.
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు.
58వ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపణ.
-
Feb 11, 2026 15:11 IST
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 14,15వ వార్డుల్లో స్వల్ప ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, సీఐ అశోక్ రెడ్డి మధ్య వాగ్వివాదం.
-
Feb 11, 2026 14:03 IST
తెలంగాణ వ్యాప్తంగా మ.1గంట వరకు పోలింగ్ నమోదు వివరాలు..
మేడ్చల్ 60.14శాతం పోలింగ్
సంగారెడ్డి 52.32 శాతం పోలింగ్
నిజామాబాద్ 35.49 శాతం పోలింగ్
మెదక్ 57.88 శాతం పోలింగ్
ఖమ్మం 59.41 శాతం పోలింగ్
జగిత్యాల 50.53 శాతం పోలింగ్
సూర్యాపేట 50.68శాతం పోలింగ్
నల్లగొండ 49.79శాతం పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం 52.61శాతం పోలింగ్
యాదాద్రి భువనగిరి 53.28 శాతం పోలింగ్
కామారెడ్డి 43.79 శాతం పోలింగ్
-
Feb 11, 2026 13:25 IST
వరంగల్: నర్సంపేట 24వ వార్డులో డబ్బుల పంపిణీ
బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.
రూ.11,600 సీజ్, కేసు నమోదు చేసిన పోలీసులు.
-
Feb 11, 2026 13:24 IST
కరీంనగర్: కిసాన్నగర్లో ఉద్రిక్తత
నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.
బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ జీప్ నుంచి బయటకు లాగిన గంగుల కమలాకర్.
అన్యాయంగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై గంగుల ఆగ్రహం.
డబ్బులు పంచుతున్నారని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు.
-
Feb 11, 2026 13:22 IST
ఖమ్మం: ఏదులాపురం జలగంనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ.
అడ్డుకున్న పోలీసులపై తిరగబడిన బీఆర్ఎస్ కార్యకర్తలు.
పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.
-
Feb 11, 2026 12:39 IST
హుస్నాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి.
-
Feb 11, 2026 12:30 IST
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
మక్తల్ మున్సిపాలిటీలో 33 శాతం పోలింగ్ నమోదు.
ఆమనగల్ మున్సిపాలిటీలో 25.58 శాతం పోలింగ్ నమోదు.
షాద్నగర్ మున్సిపాలిటీలో 32.05 శాతం పోలింగ్ నమోదు.
కొల్లాపూర్ మున్సిపాలిటీలో 31.08 శాతం పోలింగ్ నమోదు.
నారాయణపేట మున్సిపాలిటీలో 30.91 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 12:20 IST
మహబూబ్నగర్ జిల్లాలో 11:00 వరకు పోలింగ్ శాతం..
భూత్పూర్ - 38.42 శాతం
దేవరకద్ర - 43.63 శాతం
మహబూబ్నగర్ - 27.72 శాతం
-
Feb 11, 2026 12:08 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
డోర్నకల్ - 36.96 శాతం పోలింగ్ నమోదు.
పరకాల - 22.04 శాతం పోలింగ్ నమోదు.
కేసముద్రం - 39.84 శాతం పోలింగ్ నమోదు.
మరిపెడ - 42.23 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 12:07 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
ములుగు - 33.35 శాతం పోలింగ్ నమోదు.
వర్ధన్నపేట - 35.51 శాతం పోలింగ్ నమోదు.
నర్సంపేట - 34.16 శాతం పోలింగ్ నమోదు.
మహబూబాబాద్ - 32.23 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 12:07 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
జనగామ - 28.50 శాతం పోలింగ్ నమోదు.
భూపాలపల్లి - 29.97 శాతం పోలింగ్ నమోదు.
తొర్రూరు - 28.92 శాతం పోలింగ్ నమోదు.
స్టేషన్ ఘన్పూర్ - 32.22 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 12:00 IST
కామారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 23.87 శాతం పోలింగ్ నమోదు.
ఎల్లారెడ్డి - 30.60 శాతం పోలింగ్ నమోదు.
బాన్సువాడ - 30.68 శాతం పోలింగ్ నమోదు.
బిచ్కుంద - 38.98 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 11:56 IST
మెదక్ జిల్లా: రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉద్రిక్తత
బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు.
ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు.
-
Feb 11, 2026 11:54 IST
కామారెడ్డి: ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ నేతల ఆందోళన
ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సురేందర్ నిరసన.
నాన్లోకల్ కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని రోడ్డుపై బైఠాయింపు.
-
Feb 11, 2026 11:40 IST
నిజమాబాద్: బోధన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
-
Feb 11, 2026 11:34 IST
తెలంగాణలో 11గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
సూర్యాపేట జిల్లాలో 28.38 శాతం పోలింగ్.
నల్లగొండ జిల్లాలో 27.03 శాతం పోలింగ్.
కరీంనగర్ జిల్లాలో 24.36 శాతం పోలింగ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29.30 శాతం పోలింగ్.
నాగర్కర్నూల్ జిల్లాలో 29.45 శాతం పోలింగ్.
-
Feb 11, 2026 11:29 IST
వరంగల్: వర్ధన్నపేటలో బీజేపీ ఆందోళన
పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీజేపీ శ్రేణుల నిరసన.
సీఐ తన కాలర్ పట్టుకున్నారని బీజేపీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఆగ్రహం.
తన అనుచరులతో కలిసి పోలీసులతో వాగ్వాదం.
-
Feb 11, 2026 11:26 IST
నల్లగొండ జిల్లాలో 11 గంటల వరకు 27.03 శాతం పోలింగ్ నమోదు
-
Feb 11, 2026 11:25 IST
తొర్రూర్ మున్సిపాలిటీలో స్కూటీ నడుపుతూ సందడి చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
స్కూటీ మీద వెళ్ళి పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే.
వార్డులలో స్కూటీపై తిరుగుతూ పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే.

-
Feb 11, 2026 11:07 IST
సంగారెడ్డి: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 9వ వార్డులో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
-
Feb 11, 2026 10:57 IST
భువనగిరిలో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

-
Feb 11, 2026 10:52 IST
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

-
Feb 11, 2026 10:47 IST
కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Feb 11, 2026 10:46 IST
ఖమ్మం: మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-
Feb 11, 2026 10:44 IST
కామారెడ్డి పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ.
పట్టణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన షబ్బీర్ అలీ.
-
Feb 11, 2026 10:40 IST
కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.
జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్లో ఓటు వేసిన బండి సంజయ్, ఆయన కుటుంబ సభ్యులు.

-
Feb 11, 2026 10:34 IST
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో నోట్ల కలకలం.
బీఆర్ఎస్ నేత డబ్బులు పంచుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
నోట్లను రోడ్డుపై పడేసి పారిపోయిన బీఆర్ఎస్ నేత.
విచారణ జరుపుతున్న పోలీసులు.
-
Feb 11, 2026 10:31 IST
వనపర్తి: ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

-
Feb 11, 2026 10:25 IST
నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళలు

-
Feb 11, 2026 10:17 IST
ములుగులో 10.19 శాతం పోలింగ్ నమోదు.
వర్ధన్నపేటలో 13.02 శాతం పోలింగ్ నమోదు.
నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదు.
మహబూబాబాద్లో 10.58 శాతం పోలింగ్ నమోదు.
డోర్నకల్లో 13.11 శాతం పోలింగ్ నమోదు.
పరకాలలో 9.20 శాతం పోలింగ్ నమోదు.
కేసముద్రంలో 13.36 శాతం పోలింగ్ నమోదు.
మరిపెడలో 16.32 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 10:17 IST
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.
జనగామలో 10.59 శాతం పోలింగ్ నమోదు.
భూపాలపల్లిలో 12.0 శాతం పోలింగ్ నమోదు.
తొర్రూరులో 8.77 శాతం పోలింగ్ నమోదు.
స్టేషన్ ఘన్పూర్లో 11.53 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 10:13 IST
కొడంగల్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం.
-
Feb 11, 2026 10:12 IST
మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో స్వల్ప ఉద్రిక్తత.
ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
-
Feb 11, 2026 09:42 IST
9 గంటల వరకు మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతం
భద్రాద్రి కొత్తగూడెం 20 శాతం పోలింగ్ నమోదు.
భూపాలపల్లి 12 శాతం పోలింగ్ నమోదు.
సూర్యాపేట పోలింగ్ 9.58 శాతం పోలింగ్ నమోదు.
నల్లగొండ 11.20 శాతం పోలింగ్ నమోదు.
పెద్దపల్లి 11.11 శాతం పోలింగ్ నమోదు.
సుల్తానాబాద్ 15.75 శాతం పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 09:30 IST
మహబూబాబాద్: మరిపెడలో 9 గంటల వరకు 16.3 శాతం పోలింగ్ నమోదు
డోర్నకల్ మున్సిపాలిటీలో 9 గంటల వరకు 13.1 శాతంగా పోలింగ్ నమోదు.
-
Feb 11, 2026 09:30 IST
తెలంగాణ వ్యాప్తంగా ఉ.9గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు
సంగారెడ్డి జిల్లాలో ఉ.9గంటల వరకు 13.19 శాతం పోలింగ్.
సిద్దిపేట జిల్లాలో ఉ.9గంటల వరకు 15.16 శాతం పోలింగ్.
నిజామాబాద్ జిల్లాలో ఉ.9గంటల వరకు 14 శాతం పోలింగ్.
మెదక్ జిల్లాలో ఉ.9గంటల వరకు 13.64 శాతం పోలింగ్.
ఖమ్మం జిల్లాలో ఉ.9గంటల వరకు 15.37 శాతం పోలింగ్.
భూపాలపల్లి జిల్లాలో ఉ.9గంటల వరకు 12 శాతం పోలింగ్.
జగిత్యాల జిల్లాలో ఉ.9గంటల వరకు 13.23 శాతం పోలింగ్.
సూర్యాపేట జిల్లాలో ఉ.9గంటల వరకు 9.58 శాతం పోలింగ్.
నల్లగొండ జిల్లాలో ఉ.9గంటల వరకు 11.20 శాతం పోలింగ్.
-
Feb 11, 2026 09:29 IST
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 9 గంటల వరకు 9.18 శాతం పోలింగ్ నమోదు
-
Feb 11, 2026 09:27 IST
నిజామాబాద్: జిల్లాలో 9 గంటల వరకు 14 శాతం పోలింగ్
-
Feb 11, 2026 09:17 IST
జనగామ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్
జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో జరుగుతున్న పోలింగ్.
రెండు మున్సిపాలిటీల్లోని 48 వార్డుల్లో ఎన్నికలు.
పోటీలో 209 మంది అభ్యర్థులు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 62,595 మంది ఓటర్లు.
-
Feb 11, 2026 09:14 IST
హనుమకొండ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్.
నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలలో జరుగుతున్న పోలింగ్.
మూడు మున్సిపాలిటీల్లోని 64 వార్డులలో పోలింగ్.
బరిలో వివిధ పార్టీల నుంచి 270 మంది అభ్యర్థులు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 78,516 మంది ఓటర్లు.
-
Feb 11, 2026 09:10 IST
ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం నమోదైన పోలింగ్.
-
Feb 11, 2026 09:05 IST
మంచిర్యాల: లక్షెట్టిపేట 9వ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ ఆందోళన
బీఆర్ఎస్ నేత పొడేటి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-
Feb 11, 2026 08:31 IST
వికారాబాద్: పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో బోగస్ ఓట్ల గొడవ
13 వ వార్డులో 27వ పోలింగ్ స్టేషన్లో ఘర్షణ.
బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఏజెంట్ అభ్యంతరం.
ఓటర్ను బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం.
గొడవ చేస్తున్న అందరినీ బయటకు నెట్టిన పోలీసులు.
ఐదు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో 13వ వార్డు ఒకటి.
-
Feb 11, 2026 08:21 IST
మహబూబాబాద్: 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
పరస్పరం దాడి, ఇరువర్గాలకు చెదరగొట్టిన పోలీసులు.
14వ వార్డులో భారీగా మోహరించిన పోలీస్ బలగాలు.
-
Feb 11, 2026 08:06 IST
వికారాబాద్ జిల్లా: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ.
జిల్లా వ్యాప్తంగా 261 పోలింగ్ కేంద్రాలు.
జిల్లాలో మొత్తం ఓటర్లు 1,74,529.
వెబ్కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 261.
సమస్యాత్మక కేంద్రాలు 53, అతి సమస్యాత్మకం 74.
-
Feb 11, 2026 08:03 IST
మహబూబ్నగర్: 45వ డివిజన్ 5వ బూత్లో నిలిచిన పోలింగ్
అభ్యర్థుల సంఖ్య తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్.
అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్, పోలింగ్ కేంద్రం దగ్గర ఆందోళన.
-
Feb 11, 2026 08:02 IST
మేడ్చల్ : జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్
అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ లో పోలింగ్.
68 వార్డులలో 136 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
మూడు మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 65,836 మంది ఓటర్లు.
136 కేంద్రాల్లో 818 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం.
10 సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు.
-
Feb 11, 2026 07:57 IST
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పోరేషన్లు.
3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సృజన.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి.
జీహెచ్ఎంసీ కమిషనర్గా కొనసాగనున్న ఆర్వీ కర్ణన్.
-
Feb 11, 2026 07:54 IST
స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాధితుల నుంచి 5.25 కోట్లు దోచుకున్న ముఠా.
వాట్సప్ గ్రూపులు, వెబ్ లింకుల ద్వారా ట్రేడింగ్ శిక్షణ పేరుతో ఉచ్చు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కేసులు నమోదు.
-
Feb 11, 2026 07:52 IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.
7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 2,569 వార్డులకు ఎన్నికలు.
9 మున్సిపాలిటీల పరిధిలో 12 వార్డులు ఏకగ్రీవం.
మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డులో పోలింగ్ వాయిదా.