Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 12 , 2026 | 06:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 12, 2026 07:46 IST

    హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్ నెంబర్‌ 5లో కారు బీభత్సం

    • హిల్ వ్యూ అపార్ట్‌మెంట్‌ గేటును ఢీ కొట్టిన ఫెరారీ స్పోర్ట్స్ కార్

    • తెల్లవారుజామున 4గంటలకు అపార్ట్‌మెంట్ ఇంటి గేటుపైకి దూసుకెళ్లిన కారు

    • ఫెరారీ స్పోర్ట్స్ కారు ముందు భాగం ధ్వంసం

    • ఘటనాస్థలి నుంచి పరారైన యువకులు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఫిలింనగర్ పోలీసులు

  • Jul 12, 2026 07:26 IST

    తూ.గో.జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం

    • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరి మృతి

    • దేవరపల్లి నుంచి నల్లజర్లకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్

    • మృతులు దేవరపల్లికి చెందిన కార్మికులు కుక్కల శ్రీను (40), కళ్ళే రాజు(40)గా గుర్తింపు

    • కేసు దర్యాప్తు చేస్తున్న దేవరపల్లి పోలీసులు

  • Jul 12, 2026 07:23 IST

    మార్కాపురం: బేస్తవారిపేటలో ప్రమాదం

    • చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు

    • మృతుడు బేస్తవారిపేట మండలం చెట్టిచెర్ల గ్రామానికి చెందిన గురుస్వామిగా గుర్తింపు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 12, 2026 07:03 IST

    హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో తుంగతుర్తి అంశంపై సమావేశం

    • నేడు మందుల సామేల్‌ వర్గంతో జగ్గారెడ్డి భేటీ

  • Jul 12, 2026 07:03 IST

    హైదరాబాద్: నేడు పటాన్‌చెరులో BRS సభ్యత్వ నమోదు కార్యక్రమం

    • హాజరుకానున్న మాజీ మంత్రి హరీశ్ రావు

  • Jul 12, 2026 07:02 IST

    హైదరాబాద్‌: నేడు TG20 ఫైనల్‌ మ్యాచ్

    • ఫైనల్లో ఖమ్మం Vs హైదరాబాద్ మ్యాచ్

  • Jul 12, 2026 07:01 IST

    స్థిరంగా బంగారం ధరలు

    • రూ.1,44,330కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,32,700కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,40,000

    పూర్తి కథనం..

  • Jul 12, 2026 06:03 IST

    నేడు మైసూర్‌లో S.జానకి అంత్యక్రియలు

    • అభిమానుల సందర్శన కోసం మైసూర్‌లో జానకి పార్థివదేహం

    • మైసూర్‌లోని మహారాజ కాలేజీ మైదానికి జానకి పార్థివదేహం

  • Jul 12, 2026 06:03 IST

    విశాఖలో భూ ప్రకంపనలు

    • తెల్లవారుజామున పలుచోట్ల కంపించిన భూమి

    • భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

    • సాగర్‌నగర్‌, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరులో కంపించిన భూమి

    • ఈస్ట్ పాయింట్‌ కాలనీ, HB కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

  • Jul 12, 2026 06:01 IST

    నేడు ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు

    • శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు