అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మృతి..
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:19 PM
అమెరికా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కన్నుమూశారు.
అమెరికా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 71 ఏళ్ల గ్రాహమ్ శనివారం సాయంత్రం మరణించినట్లు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు (Lindsey Graham death).
దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన లిండ్సే గ్రాహమ్ 2003 నుంచి అమెరికా సెనేట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదోసారి సెనేటర్గా ఎన్నిక కావడానికి ఇటీవలే ప్రచారం కూడా ప్రారంభించారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని గ్రాహమ్ తొలుత విమర్శించారు. అయితే, అనంతరం ఆయనకు అత్యంత సన్నిహిత రాజకీయ మిత్రుడిగా మారారు (Donald Trump ally).
విదేశాంగ విధానం, జాతీయ భద్రత, ఇరాన్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వంటి అంశాలపై ట్రంప్నకు సలహాలు ఇచ్చిన ముఖ్య నేతల్లో గ్రాహమ్ ఒకరు (South Carolina Senator). ముఖ్యంగా ఇరాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తరచూ డిమాండ్ చేసేవారు. అలాగే ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుగా, అమెరికా విదేశాంగ విధానంలో ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన 'సర్జీ'.. రోబోలతో లైవ్ సర్జరీ విజయవంతం..