Share News

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి.. 101మంది గల్లంతు

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:15 PM

ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు.

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్  దాడి.. 101మంది గల్లంతు
Submarine Attacks Iranian Ship Off Sri Lanka

కొలంబో: ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి (Submarine) దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. మరో 78 మంది గాయపడినట్టు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. వీరిలో 32 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నాయి.


కాగా, 180 మందితో ఉన్న ఐఆర్ఐఎస్ దేనా నౌక మునిగిపోతున్నట్టు తమకు సమాచారం రావడంతో వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించినట్టు విదేశాంగ మంత్రి విజిత హెరాథ్ తెలిపారు. నౌక వేగంగా మునిగిపోతున్న సమయంలో 32 మందిని సిబ్బంది రక్షించారు. గాలె నగర సమీపంలో దక్షిణ తీరానికి కొద్ది దూరంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను గాలెలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సబ్‌మెరైన్‌తో దాడి జరిపిందెవరనేది వెంటనే వెల్లడి కాలేదు. ఐఆర్ఐఎస్ దేనా నౌక విశాఖపట్నంలో జరిగిన నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఐదోరోజూ ఇజ్రాయెల్, ఇరాన్ హోరాహోరీ దాడులు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మా టార్గెట్.. వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్

Updated Date - Mar 04 , 2026 | 05:27 PM