చమురు దొంగతనానికి యత్నం.. విషపూరిత వాయువులు పీల్చి 37 మంది మృతి!
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:19 PM
నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పైప్లైన్ నుంచి ముడి చమురును దొంగిలించేందుకు ప్రయత్నించిన 37 మంది విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పైప్లైన్ నుంచి ముడి చమురును దొంగిలించేందుకు ప్రయత్నించిన 37 మంది విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు సమాచారం. ఈ మృతుల సంఖ్యను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. రివర్స్ రాష్ట్రంలోని ఒక్రికా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక పర్యావరణ సంస్థ తెలిపింది.
YEAC-నైజీరియా అనే ఓ ఎన్జీఓ వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు చమురు పైప్లైన్కు అక్రమంగా కనెక్షన్ ఇచ్చి ముడి చమురును తమ పడవల్లోకి మళ్లించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విషపూరిత వాయువులు వెలువడటంతో పలువురు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం. మరికొందరి ఆచూకీ కూడా లభించలేదని సంస్థ తెలిపింది. చమురు దొంగతనం ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎంతమంది చనిపోయారనే విషయాన్ని వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని రివర్స్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి బ్లెస్సింగ్ కబోర్లో అగాబే తెలిపారు.
Also Read:
అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్ జోడీని ఓపెనింగ్కు పంపాలి: దీప్ దాస్గుప్తా
2 రోజుల పోలీస్ కస్టడీకి రిచ్కిడ్స్ ట్రాప్ నిందితులు.. అనుమతించిన నాంపల్లి కోర్టు