Share News

మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:36 PM

భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు
Indian Army Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: దేశ సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మహిళా అభ్యర్థులకు భారత సైన్యం మంచి అవకాశం కల్పిస్తోంది. ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (ఏప్రిల్ 2027 బ్యాచ్) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా అర్హత ఉన్న అవివాహిత మహిళా అభ్యర్థులు ఆర్మీలో అధికారులుగా చేరే అవకాశం పొందవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఈ పోస్టుల భర్తీ షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) విధానంలో జరుగుతుంది. మొత్తం 6 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో NCC మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు, ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ విభాగానికి 1 పోస్టు కేటాయించారు.

ఖాళీల వివరాలు

  • NCC మహిళలు: 5 పోస్టులు

  • ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్: 1 పోస్టు

  • మొత్తం ఖాళీలు: 6

అర్హతలు

NCC స్పెషల్ ఎంట్రీ కింద దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే NCC సీనియర్ డివిజన్ లేదా వింగ్‌లో నిర్దేశిత కాలం శిక్షణ పూర్తి చేసి ఉండాలి. NCC ‘C’ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం ‘B’ గ్రేడ్ సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ కేటగిరీకి దరఖాస్తు చేసుకునే వారికి కూడా గ్రాడ్యుయేషన్ అర్హత అవసరం. అయితే ఈ విభాగానికి NCC ‘C’ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు.


వయో పరిమితి

అభ్యర్థుల వయసు జనవరి 1, 2027 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2002 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించిన వారు ఈ పోస్టులకు అర్హులు.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. మొదట దరఖాస్తుల పరిశీలన, షార్ట్‌లిస్టింగ్ అనంతరం SSB ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

శిక్షణ, వేతన వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. జీతంతో పాటు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ అందజేస్తారు.


దరఖాస్తు విధానం

  • అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  • ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ (www.joinindianarmy.nic.in) లోకి వెళ్లాలి.

  • Officer Entry Application/Login విభాగాన్ని ఎంచుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

  • ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే పాత వివరాలతో లాగిన్ అవ్వాలి.

  • సంబంధిత NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్‌ను ఎంచుకుని అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి.

  • వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: జులై 21, 2026

  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21, 2026

భారత సైన్యంలో అధికారులుగా పనిచేయాలనే లక్ష్యం ఉన్న మహిళా అభ్యర్థులకు ఈ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ మంచి అవకాశంగా నిలవనుంది.


Also Read:

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం..

పురుషుల విషయంలో.. మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

Updated Date - Jul 22 , 2026 | 04:49 PM