Share News

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..

ABN , Publish Date - Jun 14 , 2026 | 02:52 PM

రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఎనర్జీ అండ్ క్లీన్ నివేదిక వెల్లడించింది.

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..
India Russian oil imports

రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఎనర్జీ అండ్ క్లీన్ నివేదిక వెల్లడించింది. మే నెలలో రష్యా నుంచి అత్యధిక చమురును కొనుగోలు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది (India Russian oil import).


ఏప్రిల్ నెలతో పోల్చితే మే నెలలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 21 శాతం మేర పెరిగాయి. వడినార్ రిఫైనరీ కొనుగోళ్లు 36 శాతం, జామ్‌నగర్ రిఫైనరీ కొనుగోళ్లు 14 శాతం వృద్ధి చెందాయి. ఇక, ప్రభుత్వ రంగ చమురు కర్మాగారాలు కూడా రష్యా ముడిచమురు దిగుమతులను గణనీయంగా పెంచాయి. గతేడాది నవంబర్ నుంచి రష్యా చమురు దిగుమతులను నిలిపివేసిన న్యూ మంగుళూరు, విశాఖపట్నం రిఫైనరీలు ఈ ఏడాది మార్చి నుంచి తిరిగి మొదలుపెట్టాయి. మే నెలలో భారీగా పెంచాయి (Russian crude oil).


ఇక, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్, తుర్కియే, బ్రూనై, జార్జియా.. ఇతర దేశాలకు 641 మిలియన్ యూరోల విలువైన చమురును ఎగుమతి చేశాయి (Russia India trade). ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ దేశాలు ఈ చమురును దిగుమతి చేసుకున్నాయి. రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ నుంచి అమెరికాకు ముడి చమురు ఎగుమతి జరిగింది.


ఈ వార్తలనూ చదవండి:

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?

జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ

Updated Date - Jun 14 , 2026 | 03:00 PM