Home » Crude Oil
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఒక్క నిమిషం వ్యవధిలో రెండు తీవ్ర భూకంపాలు రావడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతంలో బ్యారెల్ $120 మార్కును తాకిన క్రూడ్ ధరలు, ప్రస్తుతం భారీగా దిగివచ్చాయి. అయితే..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఎనర్జీ అండ్ క్లీన్ నివేదిక వెల్లడించింది.
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.
అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూత పడటం కారణంగా ప్రపంచ మార్కెట్లో ప్రతీరోజూ 13 నుంచి 14 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిందని ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, పలు చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి. సుమారు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న పలు ట్యాంకర్లు సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి.
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.