Home » Crude Oil
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హామీనిచ్చారు. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ నెరవేర్చుతామన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
దేశంలో ఇంధన సరఫరాకు ఎలాంటి సమస్య లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన నివేదికలు వెల్లడించాయి
భారత్లో ఇంధన ధరలు పెరగకపోవడంపై పాక్ మంత్రి ఒకరు పలు అభినందనపూర్వక వ్యాఖ్యలు చేశారు. పాక్ దుస్థితికి గల కారణాలను కూడా వివరించారు.
ఒపెక్ కూటమి నుంచి వైదొలగాలన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఈ చర్య ప్రపంచ చమురు, గ్యాస్ ధరలను తగ్గించడంలో సహాయపడగలదని అన్నారు.
ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయం వల్ల చమురు ఉత్పత్తుల్లో, ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. యూఏఈ నిర్ణయం వల్ల భారతదేశం బాగా లాభపడబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన సడలింపులను ఇకపై కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా స్పష్టం చేశారు.