Home » Crude Oil
ఇరాన్ ముడి చమురు రంగంపై యూఎస్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. షమ్ఖానీ నెట్వర్క్కు చెందిన పలు సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను కట్టడి చేసినట్టు యూఎస్ ట్రెజరీ తాజాగా ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హోర్ముజ్ ద్వారా జరగాల్సిన చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది.
రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి భారత్కు ఉపశమనం లభిస్తోంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి భారత్కు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
గృహ వినియోగదారుల కోసం 10 కేజీల ఎల్పీజీ గ్యాస్తో సిలిండర్లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. అవన్నీ ఊహాగానాలేనని, అలాంటి ఆలోచనలేం లేవని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా ముడిచమురుపై అమెరికా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై కూడా ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.