Share News

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:07 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 9న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం భారీ పెరుగుదల నమోదు చేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. (Gold prices).


ఈ రోజు (ఏప్రిల్ 9న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,53,830 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,010 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,53,980కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,41,160కి చేరుకుంది.

మరోవైపు వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం 2.6 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,53,830, రూ.1,41,010

  • విజయవాడలో రూ.1,53,830, రూ.1,41,010

  • ఢిల్లీలో రూ.1,53,980, రూ.1,41,160

  • ముంబైలో రూ.1,53,830, రూ.1,41,010

  • వడోదరలో రూ.1,53,880, రూ.1,41,060

  • కోల్‌కతాలో రూ.1,53,830, రూ.1,41,010

  • చెన్నైలో రూ.1,54,920, రూ.1,42,010

  • బెంగళూరులో రూ.1,53,830, రూ.1,41,010

  • కేరళలో రూ.1,53,830, రూ.1,41,010

  • పుణెలో రూ.1,53,830, రూ.1,41,010


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.2,65,100

  • విజయవాడలో రూ.2,65,100

  • ఢిల్లీలో రూ.2,60,100

  • చెన్నైలో రూ.2,65,100

  • కోల్‌కతాలో రూ.2,60,100

  • కేరళలో రూ.2,65,100

  • ముంబైలో రూ.2,60,100

  • బెంగళూరులో రూ.2,60,100

  • వడోదరలో రూ.2,60,100

  • అహ్మదాబాద్‌లో రూ.2,60,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణపట్నం పోర్టులోకి తమిళనాడు బోటు అక్రమ చొరబాటు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

Updated Date - Apr 09 , 2026 | 06:54 AM