Share News

శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:04 PM

రేపు (సెప్టెంబర్ 11) దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమ్మె వల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
Bank Strike Tomorrow: SBI Issues Customer Advisory, Check Details

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 10: రేపు (సెప్టెంబర్ 11) దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమ్మె వల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


సమ్మెకు ప్రధాన కారణాలు

5 రోజుల పనిదినాలు: వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

పీఎల్ఐ పథకం (PLI Scheme): స్కేల్ IV, అంతకంటే ఎక్కువ కేడర్ అధికారుల కోసం తెచ్చిన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానంపై బ్యాంక్ ఉద్యోగుల అభ్యంతరాలు.

పెన్షన్ సమస్యలు: పెన్షన్ సవరణలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్నారు.


వరుసగా 4 రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం

సెప్టెంబర్ 11 శుక్రవారం సమ్మె జరగనుండగా, ఆ తర్వాతి రెండు రోజులు (శని, ఆదివారాలు) బ్యాంకులకు సాధారణ సెలవులు. అలాగే సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రభావం పడనుంది.


సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ముందస్తు ప్రకటన విడుదల చేసింది. అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్నవారు సమ్మె ప్రారంభం కాకముందే పూర్తి చేసుకోవాలని సూచించింది.


భవిష్యత్ కార్యాచరణ

డిమాండ్లు నెరవేరకపోతే సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు హెచ్చరించాయి. BRICS సదస్సును దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించుకోవాలని చీఫ్ లేబర్ కమిషనర్ (Central) ప్రతినిధులు కోరినప్పటికీ, 5 రోజుల పనిదినాలపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని UFBU నాయకులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 10 , 2026 | 05:31 PM