Share News

ఏడేళ్లు కష్టపడితే టీచర్‌ అయ్యాను

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:30 AM

ఏడేళ్లు కష్టపడి చదవితే తనకు టీచర్‌ ఉద్యోగం వచ్చిందని మెగా డీఎస్సీ విజేత ఉంగరాల కవిత అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆమె ఇంటికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెళ్లి పలకరించారు.

ఏడేళ్లు కష్టపడితే టీచర్‌ అయ్యాను

  • మంత్రి సంధ్యారాణితో మెగా డీఎస్సీ విజేత కవిత

సాలూరు, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్లు కష్టపడి చదవితే తనకు టీచర్‌ ఉద్యోగం వచ్చిందని మెగా డీఎస్సీ విజేత ఉంగరాల కవిత అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆమె ఇంటికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయారు. తాము ఎవరికీ లంచాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాము నలుగురు ఆడపిల్లలమని, రోజు కూలికివెళ్లే తల్లిదండ్రులకు లంచాలు ఇచ్చేంత స్థోమత లేదని పేర్కొన్నారు. లంచాలు ఇచ్చే పరిస్థితే ఉంటే 2018లో కేవలం అర మార్కు తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగానికి దూరమయ్యేదానిని కాదని తెలిపారు.

Updated Date - Aug 28 , 2026 | 06:30 AM