ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:53 PM
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు రైలు కిందపడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రకాశం జిల్లా: సింగరాయకొండలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమికంగా.. ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సింగరాయకొండ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read:
ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..
ఈకేవైసీ లేకుంటే.. సిలిండర్ కట్