Share News

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య

ABN , Publish Date - Jul 14 , 2026 | 02:53 PM

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు రైలు కిందపడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..  రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య
Prakasam Singarayakonda Train Accident

ప్రకాశం జిల్లా: సింగరాయకొండలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ప్రాథమికంగా.. ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సింగరాయకొండ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.


Also Read:

ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..

ఈకేవైసీ లేకుంటే.. సిలిండర్‌ కట్‌

Updated Date - Jul 14 , 2026 | 03:16 PM