ఆదోనిలో వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:42 PM
ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
ఆదోని, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పట్టణంలోని అరుణ్జ్యోతి నగర్కు చెందిన సిద్ధ, సంజీవ్ తమ అనుచరులతో కలిసి సుమారు 200 కుటుంబాలతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఉమాపతినాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీనా క్షినాయుడు మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు.