Share News

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు

ABN , Publish Date - Jun 01 , 2026 | 07:39 PM

రాష్ట్రంలో15 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధమైంది.

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్01: రాష్ట్రంలో15 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. త్వరలోనే క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులకి ఊరట లభించిందని ఆయా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు అధికారులకు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..

For More AP News And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 08:14 PM