తిరుపతిలో వైసీపీ నేతలపై కేసు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:27 AM
తిరుపతిలో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, రఘునాథ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Also Read:
యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?
ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి?