శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:03 AM
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు గవర్నర్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అలాగే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కల్పవృక్ష వాహన సేవలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...