GOD: నంది వాహనంపై సంగమేశ్వరుడి విహారం
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:50 PM
మండలకేంద్రంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంగమ్మ, సంగప్పనంది వాహనంపై విహరించారు. మంగళవారం ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించా రు.
కూడేరు మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంగమ్మ, సంగప్పనంది వాహనంపై విహరించారు. మంగళవారం ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించా రు. రాత్రి స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో వాహనం లో ఉంచి ఆలయం నుంచి గ్రామంలోకి తీసుకువచ్చారు. నంది వాహ నాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంక రించి, ఉత్సవ విగ్రహాలను అధిష్టించారు. విద్యుత ద్వీపాల నడుమ స్వామివారి భక్తులకు దర్శినమించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....